కోరుట్ల, అక్టోబర్ 16: బీసీల హక్కుల సాధన కోసం అక్టోబర్ 18న జరగనున్న తెలంగాణ రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని బీసీ సంఘ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం కోరుట్ల పట్టణం గాంధీ రోడ్డులోని ఎస్.ఎస్.కే (కత్రి) భవనంలో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గోపికృష్ణ నేతృత్వం వహించారు. సమావేశానికి ప్రధాన అతిథిగా రుద్ర శ్రీనివాస్ హాజరై, ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పినా, రాజకీయ పార్టీలన్నీ తమంతట తామే బీసీలకు అవకాశాలు కల్పించవచ్చని అన్నారు. బీసీల రాజకీయ ఉనికి కోసం పార్టీలలో నిజమైన సంకల్పం అవసరమని ఆయన సూచించారు. అలాగే తెలంగాణ బందుకు అందరు సహకరించాలని కోరారు. అనంతరం గోపికృష్ణ మాట్లాడుతూ, “బీసీల హక్కుల కోసం ప్రతి విద్యార్థి, యువకులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు చురుకుగా పాల్గొనీ, రాష్ట్ర బంద్ విజయవంతం చేయడం ద్వారా మన ఐక్యతను ప్రదర్శించాలి” అని పిలుపునిచ్చారు. ఇట్టి సమావేశంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నల్ల వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు బాలె అజయ్, ఉపాధ్యక్షులు బాలె మహేష్, మహిళా అధ్యక్షురాలు జిల్లా మమత, ఉపాధ్యక్షురాలు క్యాతం విజయ, చెన్న విశ్వనాథం, చింత భూమేశ్వర్, సుదారి రాములు, రాజేశం, గట్ల నరేష్, కే. రాజేశం, ఎం. గంగాధర్, బీసీ కుల సంఘాలు, బీసీ జేఏసీ నాయకులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- బాలె అజయ్
"""" """ """ """ """" """ """ """ """ """ """ """ """ """" """ """ """
ఈ వార్త వెబ్సైట్ కు డొనేషన్ / చందా ఇఛ్చి మద్దతు చేయండి ₹ 100, 500, 1000 లేదా మీ ఇష్టం ఉన్నంత చందా ఆన్లైన్ ద్వారా ఇవండి.
గూగుల్ పే లేదా ఫోన్ పే నo : 9224717727 లేదా UPI ID : 9224717727@apl
Please Help this News Website by Donating Rs 100, 500, 1000 or any amount as you wish through Online Payment by Google Pay or PhonePe No : 9224717727 or UPI ID : 9224717727@apl
Regards

.png)