కోరుట్ల, అక్టోబర్ 17 : జగిత్యాల జిల్లా కోరుట్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఇటీవల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ (సీ.జె.ఐ.) బీ. ఆర్. గవాయిపై అడ్వకేట్ రాకేష్ కిషోర్ బూటు విసిరి దాడిచేయడం తీవ్ర ఆవేదన కలిగించిందని అన్నారు. ఇది న్యాయ వ్యవస్థ, రాజ్యాంగ స్ఫూర్తిపై దాడి అనే అభిప్రాయాన్ని ఎమ్మార్పీఎస్ వర్గీయులు వ్యక్తం చేశారు. చీఫ్ జస్టిస్ దళితుడిగా ఉండటమే ఈ దాడికి ప్రధాన కారణమని, గవాయి స్థానంలో అగ్రవర్ణానికి చెందిన జడ్జి ఉంటే ఇలాంటి ఘటన జరగేదని లేదని మండిపడ్డారు. దాడిచేసిన తర్వాత పదిరోజులు అయినానూ నిందితుడిపై కేసు నమోదు చేయకపోవడం, అరెస్ట్ చేయకపోవడం ద్వంద్వ నైతికతకు నిదర్శనమని విమర్శించారు. తక్షణమే దాడిలో నిందితుడిని అరెస్ట్ చేసి, క్రిమినల్ కేసులు బుక్ చేయాలని, ఈ ఘటన వెనుక ఉన్న శక్తులను గుర్తించేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడేలా అన్ని స్థాయిల్లో పోరాటం కొనసాగుతుందని, అక్టోబర్ 27న హైదరాబాద్లో భారీ ఆత్మగౌరవ ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నేతలు, వికలాంగుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
"""" """ """ """ """" """ """ """ """ """ """ """ """ """" """ """ """
ఈ వార్త వెబ్సైట్ కు డొనేషన్ / చందా ఇఛ్చి మద్దతు చేయండి ₹ 100, 500, 1000 లేదా మీ ఇష్టం ఉన్నంత చందా ఆన్లైన్ ద్వారా ఇవండి.
గూగుల్ పే లేదా ఫోన్ పే నo : 9224717727 లేదా UPI ID : 9224717727@apl
Please Help this News Website by Donating Rs 100, 500, 1000 or any amount as you wish through Online Payment by Google Pay or PhonePe No : 9224717727 or UPI ID : 9224717727@apl
Regards
Hemantkumar Baddy - Chief Editor
..........................................☘☘☘
.png)