నిజామాబాద్ 07.11.2025 : శుక్రవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య గారిని సి.పి హెడ్ క్వార్టర్స్ కార్యాలయానికి వెళ్ళి బుద్ధుడు అంబేడ్కర్ల పుస్తకాలు ఇచ్చి గౌరవించారు. సాయి చైతన్య విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహారిస్తారని, డ్రగ్స్ నిర్మూలన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి పని చేశారాని పేరుంది. జిల్లాలో శాంతి భద్రతలను పర్యవేక్షించడంలో చురుకుగా వ్యవహారిస్తూ, రాత్రి సమయంలో ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహిస్తుంటారని జిల్లా ప్రజలచే ప్రశంసలు పొందుతున్నారు. మరి ముఖ్యంగా జిల్లాలోని భూ సమస్యల పరిష్కారంలో కూడా పెద్ద ఎత్తున చొరవలు చూపుతున్నారు.
ఈ సన్మాన కార్యక్రమంలో జిన్నా జనార్దన్ (ప్రజాకలం వేల్పూర్ మండలం), ప్రజాకలం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అంగుళి మాలజీ, జనప్రజావాణి మోర్తాడ్ మండలం జర్నలిస్ట్ మామిడి రాజు, ఆర్మూర్ రూరల్ జర్నలిస్ట్ మూలనివాసి మాలజీ, సీనియర్ అంబేడ్కరైట్ నాయకులు మల్లూరి రాజారాం పాల్గొన్నారు.
ఆరంభంలో అంబేడ్కరైట్ జర్నలిస్టులు కమిషనర్ గారికి దిన్ దయాల్ రచించిన "అంబేడ్కర్ దిన చర్య", భారత దేశంలో బౌద్ధ ధమ్మం" అనే గొప్ప పుస్తకాలు భేటీగా ఇచ్చారు. అనంతరం పలు ప్రజా సమస్యలపై సంక్షిప్తంగా చర్చ జరిగింది.
--- మూలనివాసి మాల జీ
"""" """ """ """ """" """ """ """ """ """ """ """ """ """" """ """ """
మందు విందు వద్దురా !
మన బిసి/ఎస్సి/ఎస్టీ రాజ్యాంగం హక్కులు ముద్దురా !!
- బద్దీ హేమంత్ కుమార్ - తెలంగాణ లింక్ సంపాదకులు
"""" """ """ """ """" """ """ """ """ """ """ """ """ """" """ """ """
ఈ వార్త వెబ్సైట్ కు డొనేషన్ / చందా ఇఛ్చి మద్దతు చేయండి ₹ 100, 500, 1000 లేదా మీ ఇష్టం ఉన్నంత చందా ఆన్లైన్ ద్వారా ఇవండి.
Please Help this News Website by Donating Rs 100, 500, 1000 or any amount as you wish through Online Payment
Regards
Hemantkumar Baddy - Chief Editor
..........................................☘☘☘
.png)